బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Will lockdown be lifted after 21 days? | 21 రోజుల తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా?


india lockdown,lockdown,21 day lockdown,21 days lockdown,india lockdown for 21 days,lockdown in india, pm modi says total india lockdown for 21 days,21 days lockdown for india,coronavirus lockdown, 21 days lockdown in india,will lockdown be further extended,complete lockdown, coronavirus, coronavirus lockdown in india,pm modi says total india lockdown for 21 days

బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది


బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది

Corona-News-Obesity-Threat-During-Lock-Down-Time
బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది
కరోనా కోరలు పీకేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపుగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని - లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని.. ప్రజలు సహకరించకుంటే....పోలీసులు కఠిన చర్యలు తీసుకొనైనా సరే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని మోడీ గట్టిగా ఆదేశాలిచ్చారు. స్టే హోమ్...స్టే సేఫ్ అంటూ ప్రధాని నుంచి సెలబ్రిటీల వరకు పిలుపునిస్తున్నారు. కరోనా పుణ్యమా అంటూ ఏ ఫంక్షన్ టైంలోనో...స్పెషల్ అక్కేషన్ లోనే ఇంట్లో ఒకేసారి గుమిగూడే పిల్లలు - యువకులు - పెద్దలు - ముసలివారు..అంతా ఇప్పుడు ఒకే చోట కట్టగట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఇలా కదలకుండా..ఏమాత్రం శారీరక వ్యాయామం..అలసట లేకుండా...కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశముందని ఫిజీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉన్నాం కదా...అని స్నాక్స్ - చిరుతిండ్లు తినడం వల్ల అనర్థాలు వచ్చే అవకాశముందని వార్నింగ్ ఇస్తున్నారు.

Coronavirus Effect in Telangana | TV5 News | తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు



Coronavirus Effect in Telangana | TV5 News | తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus effect in telangana,coronavirus effect,coronavirus in india,telangana news, coronavirus effect in telangana news updates | hyderabad | tv5 news,coronavirus effect india,coronavirus india, coronavirus in andhra pradesh,coronavirus reported in andhra pradesh,coronavirus news, coronavirus, coronavirus in hyderabad,coronavirus case in india,coronavirus hyderabad latest news, coronavirus

Dr Jayaprakash Narayan Gives Advice on Present Health Issue | మూడో వంతు ఇది సోకే అవకాశం ఉంది


Dr Jayaprakash Narayan Gives Advice on Present Health Issue | మూడో వంతు ఇది సోకే అవకాశం ఉంది

jayaprakash narayan,lok satta jayaprakash narayan,jayaprakash narayan speech, dr jayaprakash narayan, jayaprakash narayan interview,loksatta jayaprakash narayan, jayaprakash narayan comments on union budget 2020,dr jayaprakash narayana, dr jayaprakash narayan about pm modi & indian economy,inspirational life story of dr jayaprakash narayan, jayaprakash narayan interviews

Janata Curfew success Rally | ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?


Janata Curfew success Rally | ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?

janata-curfew-success-rally
Janata Curfew success Rally
కరోనా వైరస్ ..దేశంలో వేగంగా  విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ కి పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఈ జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే .. జన సమూహాల్ని నివారించడం. ప్రజలు బయట ఎక్కువగా తిరిగితే కరోనా వైరస్ ఉన్న వారి నుండి  వేరే వాళ్లకు వ్యాధి సోకుతుందని - వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని - కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటే వైరస్ చైన్ బ్రేక్ అవుతుందని - దీని ద్వారా   కరోనా ప్రభావం కొద్దిగైనా  తగ్గుతుందని ఈ జనతా కర్ఫ్యూకి ప్రధాని మోడీ పిలునిచ్చారు.

అయితే ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు - కరోనా వైరస్ పై ఉన్న భయంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జనాలు చాలా క్రమశిక్షణతో కర్ఫ్యూలో పాల్గొన్నారు. దేశ ప్రజానీకం మొత్తం  ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. దుకాణాలన్నీ మూతపడి జన సంచారమే లేదు. మొత్తంగా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయినట్లే కనిపించింది. దీని వల్ల కరోనాకు చాలా వరకు బ్రేక్ పడి ఉంటుందని అంచనా వేశారు. అయితే ఉదయం నుండి సాయంత్రం 5 వరకు ఎంతో అప్రమత్తంగా ఉన్న జనాలు.. సాయంత్రం వేల అదుపు తప్పారు.

కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?



కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?

Can-The-China-Virus-Corona-Hurt-In-4-Different-Ways
కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?
వైరస్ అన్నది చాలా కామన్. అన్ని వైరస్ లు ఒకేలా ఉండవన్నట్లుగా కరోనా.. మిగిలిన వైరస్ లకు చాలా భిన్నం. ప్రపంచాన్ని వణికించిన చాలా వైరస్ లు ఉన్నాయి. ఒకప్పుడు సార్స్.. మెర్స్ వైరస్ లు వణికించాయి. కాకుంటే.. వీటితో పోలిస్తే కరోనా ప్రత్యేకత ఉంది. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించే గుణం ఉంది.

ప్రాణాలు తీసేది తక్కువే అయినా.. ప్రాణం పోయేంతలా తిప్పలు పెట్టే సత్తా దీనికి ఎక్కువ. అన్నింటికి మించిన.. ఈ వైరస్ వ్యాపించిన విషయం తెలీకుండానే.. శరీరంలో కొన్నిరోజుల పాటు తిష్ట వేసిన తర్వాతే తన విశ్వరూపాన్ని చూపిస్తుంటుంది. ప్రపంచంలో ప్రమాదకరమైన వైరస్ లకులేని గుణం.. కరోనాకు ఉన్న మరో గుణం ఏమంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేయటం.

నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?


నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?

Telangana-Lock-Down-Till-31st-March-2020
నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?
కరోనా వైరస్ విస్తరణను నియంత్రించే క్రమంలో ప్రపంచ దేశాలతో పాటు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయా దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం (ఈ నెల 22) ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం యావత్తు సంపూర్ణ మద్దతు తెలిపిన వేళ... కరోనాను పూర్తిగా తరిమివేసేందుకు ఇదే తరహా స్వీయ నియంత్రణ చర్యలు తప్పవన్న భావనలో దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రజల స్పందన. కోవిడ్ విస్తృతిపై మీడియాతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం బయటకు వచ్చిన కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా ఎవరింటికి వారు పరిమితం కావాలని ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?


కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?

Breaking-News-China-Released-Corona-Virus-For-Trade-War
కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?
కరోనా మహమ్మారి పేరు చెప్పగానే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఆ రంగం..ఈ రంగం అని తేడా లేకుండా కరోనా అన్ని రంగాలపై పంజా విసిరింది. ముఖ్యంగా కరోనా దెబ్బకు ఆ వైరస్ సోకిన దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. కరోనా దెబ్బకు చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులున్నాయని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా కుప్పకూలుతూ రికార్డు స్థాయిలో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. కరోనా దెబ్బకు లాక్ డౌన్ ప్రకటించుకోవడం వల్ల గత నెల రోజుల కాలంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పుట్టిల్లయిన చైనా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలి ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ ఆశ్చర్యకరంగా చైనా స్టాక్ మార్కెట్ గడచిన నెల కాలంలో + 0.3 శాతం వృద్ధి సాధించింది. మిగతా దేశాలన్నీ...-0.27 నుంచి -0.12 వరకు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. కానీ కరోనా దెబ్బకు కుప్పకూలిపోవాల్సిన చైనా స్టాక్ మార్కెట్ వృద్ధి సాధించడం వెనుక చైనా ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అమెరికా-చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికాను దెబ్బకొట్టేందుకు కరోనా బూచిని చైనా వాడుకుందనే అభిప్రాయాలను అమెరికన్ యూరోపియన్ ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కరోనా భూతాన్ని ప్రపంచం మీదికి వదిలి...ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టి తమ దేశ ఆర్థిక వ్యవస్థను లాభాల బాటలో పెట్టాలనే కుట్ర చైనా చేసిందని వదంతులు వ్యాపిస్తున్నాయి.

డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!


డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!

Danger-bell-16-Corona-Virus-Cases-Reported-in-Telangana-State
డేంజర్ బెల్: తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా!
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది.  చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారిని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తీసుకొచ్చి మనకు అంటించారు. తాజాగా గురువారం మరో మూడు పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 16కు చేరింది..

14 కేసులు ఇప్పటివరకు అని ప్రకంటించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. తాజాగా లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా ఉందని తేల్చడంతో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది. మార్చి 14న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా తేలింది. అతడి కుటుంబ సభ్యులను ఇంట్లోనే ఉంచి ఐసోలేషన్ చేస్తున్నారు. ఇతడు ప్రయాణించిన విమానంలో కూడా ప్రయాణించిన తోటి వారి వివరాలు సేకరిస్తున్నారు.

నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం


నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం

Nirbhaya-Rape-Case-Convicts-Hanged-to-Death-at-Tihar-Jail
నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ నకు పాల్పడి.. అమానవీయ తీరులో హింసించిన కామ పిశాచాలకు ఎట్టకేలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను విధించారు. నేరం జరిగిన 2650 రోజులకు న్యాయం లభించింది. దేశంలోని ప్రతి ఒక్కరు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించటం తప్పనిసరని భావిస్తున్న వేళ.. న్యాయపరమైన చిక్కుముడులతో తమకు విధించిన శిక్ష అమలు కాకుండా ఉండేందుకు చివరిక్షణాల వరకూ ప్రయత్నిస్తున్నప్పటికీ.. అన్ని అడ్డంకులు.. అవరోధాల్ని అధిగమించి.. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఈ తెల్లవారుజామున (శుక్రవారం) 5.30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసినట్లుగా తీహార్ జైలు అధికారులు ప్రకటించారు.

తీహార్ జైలు నెంబరు 3లో.. కోర్టు పేర్కొన్నట్లుగా నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లుగా జైలు అధికారులు వెల్లడించారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో మొత్తం పదిహేడు మంది సిబ్బంది అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంలో దోషులైన ముకేశ్ సింగ్ (32).. పవన్ గుప్తా (25).. వినయ్ శర్మ (26).. అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ జైల్లో ఉరి తీశారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ ఉరిని పూర్తి చేశారు.

ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్

ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్

China-Virus-Corona-In-Andhra-Pradesh
ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్
సర్వత్రా వ్యాపించిన కరోనా భయం అంతకంతకూ విస్తరిస్తోంది. చైనాలో స్టార్ట్ అయి.. చూస్తుండగానే యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. కొన్నిదేశాల్లో దారుణమైన పరిస్థితులకు ఈ సూక్ష్మజీవి కారణమైంది. ప్రపంచం సంగతి పక్కన పెట్టి.. మన దేశంలో.. అందునా తమ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఐదు కేసులు (ఒక కేసు విషయంలో స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యారు కూడా) నమోదు కాగా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది.

ఇదంతా చూస్తున్నప్పుడు బాగానే ఉన్నా.. పెను ప్రమాదం పొంచి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా అనుమానిత కేసులు పెద్దగా లేనప్పటికీ.. గడిచిన ఒకట్రెండు రోజుల్లో అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది కాస్తా 22కు చేరుకోవటం ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రెండో దశలోకి అడుగు పెట్టిందన్న అధికారిక ప్రకటనతో అనుమానితుల సంఖ్య పెరిగే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. దీనికి తోడు.. ఏపీలో పెరుగుతున్న అనుమానితులు నివసిస్తున్న జిల్లాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా


నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా

China-Coronavirus-Effect-on-isis-Terrorists
నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా
వారు మనుషులు రూపంలో ఉన్న నరరూప రాక్షసులు. ఈ భూమి మీద తమకు నచ్చని వారిని ఎంత దారుణంగా.. అమానవీయంగా హింసించి చంపాలో వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతారు. ఇక.. మహిళల్ని అయితే.. సెక్స్ బానిసలుగా చేస్తూ.. తాము ఆడపిల్లలుగా ఎందుకు పుట్టామురా భగవంతుడా అంటూ నిత్యం ఏడ్చేలా నరకయాతనకు గురి చేస్తుంటారు.

ఎదుటోళ్లను హింసించి.. వారి వేదనకు పండుగ చేసుకునే ఆ నరరూపరాక్షసులే ఐసిస్ ఉగ్రవాదులు. తమ తీరుతో ప్రపంచాన్ని వణికించిన వారిని.. కంటికి  కూడా కనిపించని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రాణభయంతో వారంతా జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. తమ చేష్టలతో ప్రపంచానికి వణుకు పుట్టించిన ఐసిస్ ఉగ్రవాదులు.. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లవద్దంటూ ఐసిస్ ప్రకటించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాలు అల్ నబా మ్యాగ్ జైన్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు.. కరోనా ప్రభావిత దేశాల వైపు అస్సలు వెళ్లొద్దని.. రోజులో వీలైనన్నిసార్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంది. ఆరోగ్య నిఫుణులు చేసిన సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పింది.

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

China-Coronavirus-Cases-In-India-Reach
దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా పెరుగుతూ పోతోంది.

ఇప్పటివరకు దేశంలో 107 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 12 కొత్త కేసులు పెరిగాయి. కేరళలో ఇప్పటివరకు 22 యూపీలో 11 హర్యాణాలో 14 కేసులు ధ్రువీకరించారు. వీరంతా విదేశీయులేనని కేంద్రం తెలిపింది.

ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్

ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్

India-Capital-Delhi-Shuts-Schools--Colleges--Cinema-Halls-To-Counter-Corona-virus
ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4638 మంది మృత్యువాత పడ్డారు. 126258 మందికి వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం మహమ్మారీగా ప్రకటించింది. అప్పటికే ఈ వైరస్ కారణంగా కుదేలైన మార్కెట్లు WHO ప్రకటనతో కుప్పకూలాయి. భారత్ అమెరికా జపాన్ సౌత్ కొరియా.. అన్ని దేశాల మార్కెట్లు పాతాళంలోకి జారాయి. దలాల్ స్ట్రీట్లో సెన్సెక్స్ ఏకంగా దాదాపు 3వేలు పతనమైంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు కాలేజీల్లో మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించరాదని నిర్ణయించింది. సినిమా హాల్స్ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఆదేశాలిచ్చింది. భారత్లో కరోనా కేసులు 73కు చేరుకున్నాయి.

Venkata Krishna Big Breaking Alert to Public | ప్రజలారా.. కళ్ళు తెరవండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోండి

Venkata Krishna Big Breaking Alert to Public | ప్రజలారా.. కళ్ళు తెరవండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోండి

AP24x7 ఛానెల్ యొక్క అధినేత, జర్నలిస్టు అయిన వెంకటకృష్ణ గారు కరోనా విషయంలో ప్రభుత్వానికి గట్టి సూచనలు అందించారు. స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా ధియేటర్లు రెండు,మూడు వారాలు మూసివేయడం మంచిదనే తన అభిప్రాయం తెలియజేశారు. తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను స్కూళ్లకు పంపవద్దని మనవి చేశారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం.


భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

China-Corona-virus-cases-in-India-double-from-last-week-to-62
భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు భారత్ లో కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత రెండు రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా కేరళ కర్ణాటక పూణెలో కొత్త కేసులతో హడలెత్తిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం...రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించింది.

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

yes-bank-cricis-apsrtc-deposits-stalled-bank
YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకి అందరూ భయంతో వణికిపోతుంటే ..మరోవైపు ఎస్ బ్యాంక్ దెబ్బ కూడా అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గత కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. దీనితో పలువురు ఎస్ బ్యాంక్ ఖాతాదారులు లబోధింబోమంటున్నారు. తాజాగా ఎస్ బ్యాంక్ బాధితుల్లో apsrtc కూడా చేరింది. గతంలో అధిక వడ్డీకి ఆశపడి apsrtc ఎస్ బ్యాంక్ లో లావాదేవీలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు.

Nirbhaya Accused Abuse Judicial Process | దేశ న్యాయ వ్యవస్థపై నిర్భయ నిందితుల అత్యాచారం

Nirbhaya Accused Abuse Judicial Process | దేశ న్యాయ వ్యవస్థపై నిర్భయ నిందితుల అత్యాచారం
నిర్భయ కేసు TV సీరియల్ మాదిరి సాగుతూనే ఉంది. అన్ని ఆధారాలు కూడా ఉండి వాళ్ళను ఉరి తీయాల్సిన కోర్టులు ఎందుకు కాలయాపన చేస్తున్నాయో అర్ధం కావడం లేదు. వీళ్ళ వెనుకుండీ కాపాడుతున్న ఆ ప్రభుద్ధులు ఎవరో? ఒక ఆడపిల్లను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఈ నరరూప రాక్షసుల తరపున వాదిస్తున్న న్యాయవాదులు అసలు మనుషులేనా? అనిపిస్తోంది.

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

What-Is-The-Connection-Between-Rain-And-Corona-Virus
వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అత్యంత భయంకరమైన వైరస్. చైనాలో పుట్టిన ఈ కరోనా వల్ల ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోయారు. అలాగే దాదాపుగా లక్ష మంది వరకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ కరోనా ఇప్పటికే ప్రపంచంలోని 89 దేశాలకి వ్యాప్తి చెందింది. ఇకపోతే ఈ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకున్నా.. ఈ వైరస్ బారిన పడ్డ వారిని టచ్ చేస్తే సోకుతుంది. అయితే ఈ వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు తట్టుకోలేదని వేడి ఎక్కువగా ఉంటే వైరస్ క్షణాల వ్యవధిలోనే చనిపోతుంది అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉండే ఉష్ణోగ్రతలని తట్టుకోవడం అంత ఈజీ కాదు.

అసలు ఈ వైరస్ మన దేశంలోకి ప్రవేశించిందే ..ఇతరదేశాల నుండి భారత్ కి వచ్చిన వారి వల్ల. ఈ కరోనా వైరస్ వేడిని ఎలా అయితే తట్టుకోలేదు .. అంతకు రెండురెట్లు చలి ప్రాంతంలో ప్రభావం చూపించగలదు. తక్కువ వేడి ఉన్న ప్రాంతాలలో ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుందట. అయితే ఎక్కడైనా వర్షాలు పడితే ఉష్ణోగ్రతలతో మార్పులు రావడం అనేది సహజం. దీంతో ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

Panchayat-elections-in-Andhra-Pradesh
బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

ఏపీలో ఎండలతో పాటు ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మార్చి లోనే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు సైతం పంపించింది. మార్చి 7న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 21న వీటి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక పట్టణాల్లోనూ ఎన్నికల సందడి ఒకేసారి రాబోతోంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 24న ఎన్నికలు నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

Modi-Target-After-CAA--Centre-might-bring-population-control-law-Says-Niranjan-Jyoti
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

ఒకవైపు సంచలన నిర్ణయాలు.. రకరకాల వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సీఏఏ విషయానికే వస్తే పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఢిల్లీలో అల్లర్లను పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇక ఆర్టికల్ 370 రద్దు అంశం గురించి కోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి రచ్చలు కొనసాగుతూ ఉండగానే.. మరో అంశం మీద మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇది జనాభా నియంత్రణ విషయంలో!

ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. మోడీ నెక్ట్స్ టార్గెట్ అదే క్లూ ఇచ్చారు! దేశంలో జనాభా నియంత్రణ చట్టం రాబోతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే గనుక వస్తే  పెను సంచలనం అవుతుంది.

నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరే!

Delhi-Court-Refuses-To-Put-On-Hold-Nirbhaya-Convicts-Execution-Tomorrow
నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరే!

నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత..ఇక ఉరే!

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచార కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ శిక్ష అమలులో రోజుకో పరిణామా చోటుచేసుకుంటూ ఉత్కంఠ నెలకొంది. చట్టంలో ఉన్న లొసుగులను వినియోగించుకుంటూ నిందితులు కేసును సాగదీస్తున్నారు. దీంతో వారికి విధించిన ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్భయ హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు  సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

A-daughter-who-killed-a-surviving-mother-for-insurance-bills
భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

ఈ ప్రపంచంలో తల్లి బిడ్డల ప్రేమకి మరొకటి సాటిరాదు లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులకి కొడుకు అన్నం కూడా పెట్టడం లేదు ..భార్య వచ్చిన తరువాత కని పెంచిన తల్లిదండ్రులు కూడా బరువైపోతున్నారు అని కంటే కూతుర్నే కనాలి అంటూ పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు. నేటి రోజుల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది ..ఏమిటంటే ..కొడుకు అయితే తల్లితండులకి కూడు పెట్టడు అదే కూతురు అయితే తల్లిదండ్రులని కంటికిరెప్పలా చూసుకుంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయని భావిస్తున్నారు. కానీ తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే కూతురు కంటే కొడుకే నయం అని అంటారేమో...

తండ్రి చనిపోయాడు అనే భాద లేకుండా తల్లికి వచ్చే చంద్రన్న భీమని కాజేయాలని బతికున్న తల్లి చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఈ నిర్వాకానికి చంద్రన్న భీమా సిబ్బంది కూడా సహకారం అందించడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట లో జరిగింది.

Related Posts Plugin for WordPress, Blogger...