మన దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పసికందుల నుండి పండు ముదుసలి వరకూ అత్యాచార మృగాలకు బలవుతూనే ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోతూనే ఉన్నారు. ఇక నుండి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన చట్టాలను ఏవిధంగా మార్చాలి? మీ సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి. నలుగురికి అవగాహన కల్పించండి.
Showing posts with label AP/TS News. Show all posts
Showing posts with label AP/TS News. Show all posts
బాధితుల్ని కాపాడలేని పోలీసులు నిందితుల్ని మాత్రం రక్షిస్తున్నారు
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ఘటన జనాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఉదంతం జరిగి ఐదు రోజులు దాటుతున్నా ప్రజాగ్రహం చల్లారలేదు. ఆ నిందితుల్ని మా చేతికివ్వండి.. వాళ్లకు నరకం చూపించి హతమారుస్తాం అంటూ జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశాక జైలుకు తరలించే సమయంలో షాద్ నగర్ ప్రాంతంలో ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల పైకి జనాలు ఎప్పుడెలా ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
Subscribe to:
Posts (Atom)