బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label Corona Virus News. Show all posts
Showing posts with label Corona Virus News. Show all posts

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

india-surpasses-italy-in-corona-deaths
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
భారత దేశంలో కరోనా కేసులు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా 779 మరణాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్కరోజు 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 16.4 లక్షలు దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 547726 కాగా రికవరీలు 1060000 ఉన్నాయి. మరణాలు 35817గా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 31 మంది మరణించారు.

కరోనా కేసుల్లో మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35132 మంది మృతి చెందగా ఇండియాలో 35817 ఉన్నాయి.

ISIS seeks to inflict corona on India .. | భారీ కుట్రకు తెర : భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్..

భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్.. 

ISIS seeks to inflict corona on India ..
భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్
దారుణమైన మైండ్ సెట్ తో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.

భారత్ ను దెబ్బ తీయటం కోసం ఐసిస్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన
WHO-sensational-statement-on-the-virus
మహమ్మారి వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ వైరస్ కట్టడి.. నివారణ.. మందు కనిపెట్టుట.. వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఈ వైరస్ ఇప్పట్లో వైరస్ అంతం కాదని ఇంకా ప్రభంజనం కొనసాగుతుందని కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమవడానికి అనువైన వాతావరణం ఉందని.. ఇంకా ఉధృతి పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని.. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వైరస్ కట్టడి చర్యలు సమగ్రంగా అమలవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని దేశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

ప్రధాన పత్రికకు కరోనా సెగ..16మందికి పాజిటివ్

ప్రధాన పత్రికకు కరోనా సెగ..16మందికి పాజిటివ్

New-Dangerous-Disease-Hits-in-News-Media
హైదరాబాద్ లో కరోనా విచ్చలవిడిగా అందరికీ సోకుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెద్దగా టెస్టులు చేయకపోవడంతో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు. ఉన్నవారు కరోనా బాంబర్లుగా మారి అందరికీ అంటించేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి తెలుగులోనే ప్రధాన పత్రిక తన ఉద్యోగులైన జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయించిందట ఇందులో షాకింగ్ విషయం బయటపడినట్టు మీడియా వర్గాల సమాచారం.

సదురు ప్రధాన పత్రికకు కరోనా సెగ తగిలిందట. ఒకటి కాదు రెండు కాదు.. ప్రధాన కార్యాలయంలోని 125మందికి కరోనా టెస్టులు చేయిస్తే ఏకంగా 16మందికి పాజిటివ్ గా బయటపడడంతో ఆ మీడియా సంస్థ ఉలిక్కిపడింది.ఈ పదహారు మంది ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు? అనే విషయాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

ఉద్యోగులకి కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ హైకోర్టు

ఉద్యోగులకి కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ హైకోర్టు

Andhra-Pradesh-High-Court-issued-new-guidelines-for-employees
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  రోజురోజుకీ వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. దీనితో రాష్ట్ర ప్రజానీకంతో పాటుగా ...ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో లాక్ డౌన్ కూడా విధించింది ప్రభుత్వం. ఇక శనివారం ఏపీలో  కొత్తగా 491 కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు అధికారులకు సిబ్బందికి ఉద్యోగులకు కీలక మర్గదర్శకాలు విడుదల చేసింది. కార్యాలయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదని హైకోర్టు రిజిస్ట్రర్ రాజశేఖర్ పలు సూచనలు చేశారు. హైకోర్టు అధికారులు సిబ్బంది కేంద్ర కార్యాలయం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా అలా కార్యాలయం విడిచి వెళ్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.  అలానే కోర్టు వరండాల్లో జనసమూహం ఎక్కువగా ఉండటానికి వీల్లేదని పేర్కొన్నది.  కోర్టు ఆవరణలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.   కొత్త మార్గదర్శకాలను ఉద్యోగులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.  కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్

హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్

23-journalists-test-Dangerous-Disease-positive-in-Hyderabad-in-a-day
ప్రజల సమస్యలు.. మహమ్మారి వేళ.. ప్రభుత్వ ఏర్పాట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కీలకమైన జర్నలిస్టుల్ని మాయదారి రోగం కమ్మేసింది. ఈ మధ్యనే కొందరు జర్నలిస్టులకు పాజిటివ్ గా తేలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు.. నాలుగు రోజుల క్రితం తెలంగాణ సెక్రటేరియట్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని నిర్వహించారు.

ఈ టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తంగా నలబై మందికి నిర్వహించిన పరీక్షల్లో 23 మందికి పాజిటివ్ గా తేలటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఆదివారం సాయంత్రం వేళలో బయటకు వచ్చింది. హైదరాబాద్ మీడియాలో ఇదో షాకింగ్ గా మారింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రిపోర్టింగ్ లో ఉన్న వారికి.. డెస్కులో ఉన్న వారికి సైతం పాజిటివ్ కావటం గమనార్హం.

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

India-Overtook-The-UK-To-Become-The-Fourth-Worst-Hit-Nation
భారత్ లో  మహమ్మారి జోరు చాలా ఉదృతంగా కొనసాగుతోంది. రోజుకు సుమారు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు రికార్డువుతుండడంతో మిగతా దేశాలను భారత్ వేగంగా దాటేస్తోంది.  ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ను దాటేసింది.  2074397 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (787489) - రష్యా (502436) వరుసగా రెండు - మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 9996 కొత్త  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 286589కి చేరింది. వీరిలో ఈ  మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 141029 మంది కోలుకోగా.. 8102 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 137448 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

PM-Narendra-Modi-annouced-Rs-20-lakh-crore-for-self-development

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

కరోనా మహమ్మారిపై కొనసాగిస్తున్న పోరులో కీలక దశగా భావిస్తున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా? లేదంటే... ఈ నెల 17తోనే ఎత్తేయాలా? అన్న విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనదైన మార్క్ సస్పెన్స్ ను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా నానాటికీ కుదేలవుతున్న ఆర్థిక రంగానికి ఊపిరిలూదేలా లాక్ డౌన్ ను ఈ నెల 17తో ముగిస్తారని దాదాపుగా అన్ని వర్గాలు భావిస్తే... అందుకు విరుద్ధంగా వ్యవహరించిన మోదీ.. అసలు లాక్ డౌన్ ను పొడిగించాలా? వద్దా? అన్న విషయంపై ఈ నె 18 లోగా నిర్ణయం తీసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పేశారు. అయితే కుదేలైన ఆర్ధిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేలా ఏకంగా రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేశారు.

షాకిచ్చిన కేంద్రం: కరోనాతో కలిసి బతకాల్సిందేనట.!

 
కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం.. కట్టడికి విధించిన లాక్ డౌన్ పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వంలో నిరాశ నిసృహ వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో  కరోనా కేసుల సంఖ్య 59662కి చేరిందని.. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 1985మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని.. మన ముందు పెద్ద సవాల్ ఉందని.. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయటపడలేదన్నారు.

లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీల కోసం 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. 2.5 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లారని వివరించారు.

ఇది వరకు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే మాట అని లాక్ డౌన్ సడలించాలని.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేంద్రం ప్రకటన చెంపపెట్టులా మారింది.

చెన్నై మార్కెట్ వల్లే ఏపీలో కరోనా..700మంది కోసం వేట!

చెన్నై మార్కెట్ వల్లే ఏపీలో కరోనా..700మంది కోసం వేట!

ఏపీలో కరోనా వ్యాప్తిపై సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం ఈ సందర్భంగా ఏపీలో కరోనా వ్యాప్తికి తమిళనాడు కోయంబేడు మార్కెట్ ఒక కారణం అని చెప్పుకొచ్చారు. ఆ మార్కెట్ వల్లే చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని.. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన రైతులతోపాటు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన 700మంది కూలీలపై దృష్టిపెట్టామని తెలిపారు. ఈ 700మంది కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించారని.. వారికి అనుమతులు లేవని.. పరీక్షలు చేయించుకోలేదని.. వారి వల్లే కరోనా వ్యాపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వివరాలు తెలుసుకొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.

ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే ముప్పు ఎక్కువగా ఉందని సీఎం జగన్ అన్నారు. వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.ఇందుకోసం సరిహద్దుల్లో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ ముందుందని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 165069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 3091 పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు.

మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?


మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?

Coronavirus-in-Hyderabad-Telangana
మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?
ఎలాంటి హైదరాబాద్ ఎలా మారిపోయింది? కొన్ని దశాబ్దాలుగా నిద్రను మరిచిన నగరం ఇప్పుడు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా విశ్రమిస్తోంది. విశాలమైన రోడ్లు బోసిపోతుంటే.. విపరీతమైన రద్దీతో ఉండే దిల్ సుఖ్ నగర్.. కుకట్ పల్లి.. అమీర్ పేట.. ఐటీ కారిడార్.. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ పరిధిలో ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. కరోనా పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరాన్ని ఇలా కూడా చూసి రావాల్సి వస్తోందని బోరుమనేవారు లేకపోలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు లాంటి రద్దీ ప్రాంతంలో రోడ్డు మీదకు నెమలి నడుచుకుంటూ వచ్చిందంటే.. నగరం ఎలా మారిందో ఇట్టే అర్థమైపోతుంది.

అంతేనా.. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ మహా నగరంలో రాత్రిళ్లు రోడ్ల మీదకు టూవీలర్ మీద బయటకు రావటం అంటే పెద్ద సాహసం కిందనే లెక్క. మీరనుకున్నట్లు పోలీసుల కారణంతో కాదు.. వీధి కుక్కల దెబ్బకు వణికిపోవాల్సిందే. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా లైట్ల కాంతులతో.. జనసంచారంతో ఉండే వీధులు వారాల తరబడి నిర్మానుష్యంగా మారిపోవటంతో రోడ్లున్ని కుక్కల మయంగా మారింది. లాక్ డౌన్ ప్రభావం ఆ మూగ జీవాల మీదా పడింది. వాటికి సరైన ఆహారం లేకపోవటంతో తీవ్రమైన అసహనంతోనూ.. ఆవేశంగానూ కనిపిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం రాత్రిళ్లు టూ వీలర్ మీద వెళ్లే వారంతా హడలిపోతున్నరు. పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న దుస్థితి.

ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా



ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా

Breaking-News-America-Revealed-India-Craze
ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా
భారత్ ఎన్ని సాధించినా.... ప్రపంచం ఒప్పుకోదు. సరిగ్గా చెప్పాలంటే ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇండియాను పేద దేశంగా చూపడానికి ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమే ఉండదు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ సాధిస్తున్న రికార్డులను ప్రపంచం గుర్తించకుండా ఉంచడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. వాటిలో ఒకటి... భారత్ కరోనాను ఇతర దేశాల కంటే సమర్థంగా కంట్రోల్ చేయడం వల్ల ఎక్కడ మనం గ్లోబల్ లీడర్ అవుతామో అన్న భయంతో ఐక్య రాజ్య సమితి కరోనా వల్ల భారత్ లో 40 కోట్ల మంది పేదరికంలోకి పోతారు అని ఒక నివేదిక అర్జెంటుగా బయట పెట్టింది. ఇది ఎంత చోద్యం అంటే... 200 దేశాల్లో కరోనా వస్తే భారత్ సహా ఎన్నో దేశాలు లాక్ డౌన్ పెడితే కేవలం భారత్ మాత్రమే ఎందుకు పేదరికంలోకి పోతుంది? ఈ నష్టం అందరికీ జరుగుతుంది కదా? మరి ఎందుకు ఈ రిపోర్టు అంటే... భారత్ ను అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మన సమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం. చేతిని అడ్డుపెట్టి సూర్యడిని ఆపగలమా? సాధ్యం కాదు. ఇది కూడా అంతే.

Lockdown Creates Dramatic impact on Air Quality | లాక్ డౌన్ తో ప్రకృతికి మంచి రోజులు వచ్చాయా?


Lockdown Creates Dramatic impact on Air Quality | లాక్ డౌన్ తో ప్రకృతికి మంచి రోజులు వచ్చాయా?

lockdown,lockdown extend,impact of lockdown on nature,air quality,corona lockdown,environmental impact of lockdown, cm kcr on lockdown,lockdown updates from delhi,lockdown breakdown, lockdown terms, lockdown in india,lockdown modi,environmental impact of coronavirus pandemic, lockdown rules,changes created by the coronavirus,lockdown to extend,changes created by coronavirus, implement lockdown rules @ vizag,coronavirus

ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!



ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!

China-Virus-Corona-Effect-on-American-States
ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!
ప్రాణాంతక వైరస్ కరోనాతో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. అసలు కరోనా సోకని కరోనా పేరు వింటే భయపడని దేశమంటూ ఇప్పుడు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక ప్రపంచంలో ఏ మూలఏ దేశంలో విపత్తు ఎదురైనా... అండగా తానున్నానంటూ రంగంలోకి దిగే అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అసలు కరోనాతో అత్యంత ఎక్కువ నష్టం నమోదైన దేశం అమెరికా అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే... కరోనా పుట్టిన చైనాలో కంటే కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ. మరణాల సంఖ్య కూడా అమెరికాలోనే అధికం. ఇంకా చెప్పాలంటే... అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ లో నమోదైన పాజిటివ్ కేసులు మరణాలు పరిశీలిస్తే... కరోనాతో అమెరికాకు జరిగినంత నష్టం మరే దేశానికి కూడా జరగలేదనే చెప్పదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ దాని ప్రభావంతో జరుగుతున్న నష్టం కరోనాతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫలితంగా మారిపోతున్న మానవ సంబంధాలు తెగిపోతున్న భవ బంధాలు... ఇలా ప్రతి అంశం కూడా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.

కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు


కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు

China-virus-Corona-lockdowns-have-changed-the-way-Earth-moves
కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఆ వైరస్ ప్రభావంతో మానవాళి ప్రపంచం ఇంటికే పరిమితమైంది. ప్రజల కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రోడ్లన్నీ బోసిపోయాయి. మార్కెట్ ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. ఈ నేపథ్యంలో భూగోళమంతా ప్రశాంతంగా ఉంది. ప్రపంచమంతా లాక్ డౌన్ చేయబడింది. దీంతో ఇప్పుడు భూ - జల - రోడ్డు మార్గాలు అన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైలు - రోడ్డు - జల మార్గాలు స్తంభించిపోయాయి. ఈ కరోనా వైరస్ మానవాళికి ఎంతో నష్టం చేకూరుస్తున్నా.. భూగోళానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాలుష్యాలు తగ్గిపోయాయి. ఈ సందర్భంగా భూతాపం తగ్గింది. ఈ క్రమంలో భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గాయంట.

అయితే ఈ కరోనా వైరస్ మూలంగా భూగోళంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని ఆ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిణామాలు అంతా లాక్ డౌన్ వలన వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూ విజ్ఞాన - భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో బెల్జియంలో కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ పకడ్బందీగా ఆ దేశంలో అమలు చేయడంతో ఆ దేశ వాతావరణ పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయంట. ఇదే సమయంలో ఈ దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో భూకంప శబ్ధంలో 30 నుంచి 50 శాతం తగ్గాయని సీఎన్ ఎన్ వెల్లడించింది.

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!


ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!
Study-on-China-Virus-Corona-Spread-in-india
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!
ఇండియాలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుందని.. దాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందంటూ ప్రముఖ మీడియా సంస్థ ది గార్డియన్ తన గ్రౌండ్ విశ్లేషణలో పేర్కొంది. ది గార్డియన్ చెబుతున్న కథనం ప్రస్తుతం జనాలను భయకంపితులను చేస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం సిద్దంగా లేదని కనీసం కరోనా వైరస్ నిర్థారించే కిట్ లు కూడా ఇండియాలో అధికంగా లేవు. ఇప్పటి వరకు కేవలం 50 వేల మందికి మాత్రమే కరోనా పరీక్షలను ఇండియాలో నిర్వహించారు.

ప్రస్తుతం పుణెలోని మై ల్యాబ్ సంస్థ మాత్రమే కరోనా టెస్టు కిట్ లను తయారు చేస్తోంది. ఆ ఒక్క సంస్థ తయారు చేసే కరోనా టెస్టు కిట్ లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం సరి పోవు. ఇక భారత్ లో కరోనా టెస్టుకు కేవలం 52 ల్యాబ్స్ కు మాత్రమే అనుమతించింది. దేశంలో ఉన్న జనాభాకు ఆ ల్యాబ్స్ సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వైరస్ వ్యాప్తి చెందుతున్న స్పీడ్ ను చూస్తుంటే మే నాటికి ఇండియాలో 13 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా టెస్టింగ్ కిట్స్ ను ఎక్కువ మొతాదులో తయారు చేయాల్సిన అవసరం ఉందని ది గార్డియన్ కథనంలో పేర్కొన్నారు.

దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా


దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా

9-UN-employees-in-Geneva-test-positive-for-china-Virus-corona
దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా
వారిని వీరిని అనే తేడా లేకుండా ప్రపంచ దేశాల్లో అందరిని కూడా కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా వైరస్ కారణంగా పలు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి అధికారులు అన్ని దేశాలకు సంబంధించిన విషయాలను సేకరించడం.. అవసరం అయిన సాయంను అందించడం చేస్తున్నారు. ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి చాలా కీలకంగా వ్యవహరిస్తుందని ఇటీవలే అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి కథనంను రాయడం జరిగింది.

ఇంతలోనే జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. ఈ విషయంను ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన అలెసాండ్రా వెలుసి తెలియజేశారు. ప్రస్తుతం వారి వివరాలను వెళ్లడి చేయలేం. కాని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వారు త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

Will lockdown be lifted after 21 days? | 21 రోజుల తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా?


india lockdown,lockdown,21 day lockdown,21 days lockdown,india lockdown for 21 days,lockdown in india, pm modi says total india lockdown for 21 days,21 days lockdown for india,coronavirus lockdown, 21 days lockdown in india,will lockdown be further extended,complete lockdown, coronavirus, coronavirus lockdown in india,pm modi says total india lockdown for 21 days

Coronavirus Effect in Telangana | TV5 News | తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు



Coronavirus Effect in Telangana | TV5 News | తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus effect in telangana,coronavirus effect,coronavirus in india,telangana news, coronavirus effect in telangana news updates | hyderabad | tv5 news,coronavirus effect india,coronavirus india, coronavirus in andhra pradesh,coronavirus reported in andhra pradesh,coronavirus news, coronavirus, coronavirus in hyderabad,coronavirus case in india,coronavirus hyderabad latest news, coronavirus

Dr Jayaprakash Narayan Gives Advice on Present Health Issue | మూడో వంతు ఇది సోకే అవకాశం ఉంది


Dr Jayaprakash Narayan Gives Advice on Present Health Issue | మూడో వంతు ఇది సోకే అవకాశం ఉంది

jayaprakash narayan,lok satta jayaprakash narayan,jayaprakash narayan speech, dr jayaprakash narayan, jayaprakash narayan interview,loksatta jayaprakash narayan, jayaprakash narayan comments on union budget 2020,dr jayaprakash narayana, dr jayaprakash narayan about pm modi & indian economy,inspirational life story of dr jayaprakash narayan, jayaprakash narayan interviews

Related Posts Plugin for WordPress, Blogger...