India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
![]() |
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్ |
కరోనా కేసుల్లో మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35132 మంది మృతి చెందగా ఇండియాలో 35817 ఉన్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో 4635226 కేసులు 155306 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసుల్లో 2613789తో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో అమెరికా బ్రెజిల్ (91377) మెక్సికో (46000) యూకే (45999) ఫ్రాన్స్ (30254) స్పెయిన్ (28443) ఉన్నాయి.
No comments:
Post a Comment