బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

Telangana-Hyderabad-As-Beggar-Free-City---It-is-Possible
బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

భారతదేశం ...ప్రపంచపటంలో మన ఈ దేశానికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు ప్రపంచం మొత్తం దాసోహం అంటుంది. కానీ దేశంలో కటిక పేదరికంలో బ్రతికేవారు కూడా లక్షల్లో ఉన్నారు. అన్నపూర్ణగా పిలిచే దేశంలో పట్టెడు అన్నం కోసం దేహి అంటూ యాచించే వారు చాలామంది ఉన్నారు. రోజురోజుకి ఇలాంటివారు దేశంలో పెరిగిపోతున్నారు. దీనితో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది . ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద దేవాలయాల వద్ద ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు. హైదరాబాద్ ను యాచక రహిత నగరంగా (బెగ్గర్ ఫ్రీ సిటీ గా) మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం మొదటగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ..బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

American-President-Jimmy-Carter-changing-its-name-to-Carterpuri
అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో తొలిసారిగా అడుగు పెట్టిన సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. భారత్ లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్ ఏడవ అధ్యక్షుడిగా నిలిచారు. ట్రంప్ నకు సంబందించిన అంశాలు అలా పక్కనపెడితే...ఓ అధ్యక్షుడి పేరుతో మనదేశంలో ఓ గ్రామం ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

మెలానియా ట్రంప్ జీవిత విశేషాలు

Melania-Trump-Life-Story

మెలానియా ట్రంప్ జీవిత విశేషాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటన నేపథ్యంలో మోలానియా ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.

* మోలానియా 1970 సంవత్సరంలో యూరప్ లోని స్లోవేనియాలో జన్మించింది. 16ఏళ్ల వయస్సురాగానే మోడలింగ్ రంగంలోకి వెళ్లింది.

* 1998లో న్యూయార్క్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ పార్టీలో మెలానియా తొలిసారిగా ట్రంప్ ను కలిసింది.

* ఆ సమయంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. మెలానియా కలిసే నాటికే ట్రంప్ కు అప్పటికే రెండు వివాహాలు అయ్యాయి.

పౌరసత్వం నిరూపించుకోండి..127 మంది హైదరాబాదీలకు నోటీసులు !

Indian-Aadhaar-Company-shock-to-127-Hyderabadis

పౌరసత్వం నిరూపించుకోండి ....127 మంది హైదరాబాదీలకు నోటీసులు !

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలోని ముస్లిములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేనేలేదు అని తేల్చిచెప్పింది. ఈ తరుణంలో హైదరాబాద్ లో మీ పౌరసత్వం నిరూపించుకోండి అంటూ 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీచేసింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

New sanctions in China .. to come out once in three days | చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి

new-sanctions-in-china-to-come-out-once-in-three-days
New sanctions in China .. to come out once in three days

New sanctions in China .. to come out once in three days | చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి

ఎంత ప్రయత్నించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతకూ కంట్రోల్ కాని కొవిడ్ 19 వైరస్ సంగతి చూసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ.. ఈ వైరస్ విస్తరించటాన్ని మాత్రం ఆపలేక పోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు.. వేలాది మందికి ఈ మాయదారి వైరస్ సోకుతుండటంతో ఆ దేశం తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతోంది. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఈ వైరస్ తో డ్రాగన్ దేశం ఆగమాగమవుతోంది.

కొవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సులో ఇప్పటికే పలు నిషేధాలు విధించారు. ప్రజా రవాణాను నిలిపివేయటం.. రైళ్లు.. విమాన సర్వీసుల్ని ఆపేశారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలోని ప్రజలు బయటకు రావొద్దని చెబుతున్నారు. అయినప్పటికీ.. వైరస్ వ్యాపించటం ఆగని నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఆంక్షల్ని అక్కడి ప్రజలకు విధించారు.

బీజేపీతో పొత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్క తప్పింది?

Janasena-Leader-Pawan-kalyan-Misses-Clarity-on-about-Alliance-With-BJP-Party

బీజేపీతో పొత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్క తప్పింది?

నాక్కొంచెం తిక్కుంది....కానీ దానికో లెక్కుంది....గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే సినిమాల్లో  పవన్ కల్యాణ్ లెక్క పక్కాగా ఉన్నా.....రాజకీయాల్లో మాత్రం ఆ లెక్క తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని 2014లో చెప్పిన పవన్ కల్యాణ్....అధికారంలో ఉన్న టీడీపీతో పొత్తుపెట్టుకొని ప్రశ్నించడం మానేయడంతో మొదటి సారి లెక్క తప్పారు. 2019లో ఒంటరి పోరాటం చేసి కుమారస్వామి తరహాలో సీఎం అయిపోదామనుకొని రెండో సారి లెక్కల్లో ఫెయిల్ అయ్యారు. ఇక తాజాగా 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీ రాజకీయాల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామనుకొని ముచ్చటగా మూడోసారి లెక్క తప్పారు. బీజేపీతో జనసేన పొత్తు పూర్తిగా పొడవక ముందే....ఎన్డీఏలో వైసీపీ చేరడం దాదాపుగా ఖాయమవడంతో పవన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కేబినెట్లో చేరితే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి?

What-Is-The-Situation-Of-Janasena-Leader-Pawan-Kalyan-If-That-Happened

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కేబినెట్లో చేరితే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరుతుందనే ఊహాగానాలు పవన్ కల్యాణ్ వీరాభిమానులను ఉక్కిరిబిక్కరి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్లు జగన్ ను పిలిచి మరీ పదవులు ఇస్తే అప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇటీవలే పవన్ కల్యాణ్ వెళ్లి బీజేపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవనే చాలా ఆసక్తిగా ఢిల్లీకి వెళ్లారు. ఒకటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. అయితే కనీసం అమిత్ షాను కానీ మోడీని కానీ కలవలేకపోయారు. చివరకు ఏదో నిర్మలా సీతారామన్ ను కలిసి చేతులుదులుపుకున్నారు పవన్. అంతటితో తనే వీర హిందుత్వవాదిగా మారిపోయారు పీకే. అంత వరకూ కమ్యూనిస్టులతో దోస్తీ చేసి ఎన్నికల సమయంలో బీజేపీని విమర్శించి.. పీకే చివరకు బీజేపీ సన్నిహితుడు అయిపోయాడు.

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

when-is-punishment-for-fearless-guilty
        
కన్నకూతురు క్రూరమృగాల పట్ల చిక్కుకుపోయిన లేడిపిల్లలా మానవమృగాలకు బలయిపోయిందన్న వార్త ఆ తల్లిదండ్రులు ఎలా భరించారో ఊహిస్తేనే భయమేస్తుంది.

నిర్భయ ఉదంతం దేశమంతా అట్టుడుకిపోయేలా చేసింది. ఆ మానవమృగాలను ఉరి తీసేసి దేశానికి పట్టిన దరిద్రాన్ని ఈచట్టాలు వదిలించడం మాని ఎందుకు జాప్యం చేస్తున్నాయో అర్ధం కావడం లేదు.

ఒక ఆడబిడ్డను అతి కిరాతకంగా హింసించి.. పైశాచికంగా రేప్ చేసి చంపేసిన ఈ దుర్మార్గులను లొసుగులతో ఉన్న చట్టాలే ఏమీ చేయలేనప్పుడు రాజకీయ నాయకులు, బడాబాబుల యొక్క చీకటి బాగోతాలు, ఆర్ధిక నేరాలు పట్టుకుని ఈ చట్టాలు ఏమి చేయగలవు?

మన దేశ నేరస్తులకు గరుడపురాణమే న్యాయం చేస్తుంది. చచ్చిన తరువాత చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలని గరుడపురాణం చెప్తుంది కాబట్టి మనకి కరెక్ట్ చట్టాలు ఆ భగవంతుడి సన్నిధిలో జరిగేవే తప్ప మన చట్టాలు ఏమీ చేయలేవు.

దిశను అత్యాచారం చేసి చంపేసిన నిందుతులను ఎంకౌంటర్ పేరుతో కాల్చి పడేసినప్పుడు అడ్డు రాని చట్టాలు నిర్భయ దొషులను ఉరి తీయడంలో ఎలా అడ్డొస్తున్నాయో ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి. లొసుగులు, బొక్కలు లేని చట్టాలు రూపొందించుకోవాలి.

దయచేసి నిర్భయ తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్ధం చేసుకుని ఆ దుర్మార్గులను ఉరి తీసి.. ఆ అమాయక తల్లిదండ్రులకు కొద్దిగానైనా మనస్సుకు నెమ్మది కలిగించమని కోర్టులను,ప్రభుత్వాలను వేడుకుంటున్నాను

నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

Dilhi-Nirbhaya-mother-breaks-down-in-court
నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

కదులుతున్న బస్సులో ఏ పాపం తెలీని ఒక నిస్సహాయ ఆడపిల్లను అత్యంత దారుణంగా.. పైశాచికంగా.. మాటల్లో వర్ణించలేనంతగా మానసికంగా.. శారీరకంగా హింసించి.. ఆమె మరణానికి కారణమైన వారికి విధించిన ఉరిశిక్ష అంతకంతకూ వాయిదాలు పడుతున్న వైనంపై దేశ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేరం రుజువై.. వారు తప్పు చేసినట్లు పలు కోర్టులు తీర్పులు చెప్పేసిన తర్వాత.. శిక్ష అమలు కాకుండా అడ్డుకునేందుకు న్యాయశాస్త్రంలో తమకున్న అవకాశాల్ని వాడుతున్న నిర్భయ దోషుల తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు ఒకటి తర్వాత ఒకటి చొప్పున వ్యూహాత్మకం తెర మీదకు తీసుకొచ్చి శిక్ష అమలు కాకుండా చేస్తున్నారు. దీంతో.. నిర్భయ దోషుల ఉరి ఆలస్యం కావటమే కాదు.. అసలు అమలు చేస్తారా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే.. దోషులకు డెత్ వారెంట్లు ఇష్యూ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు మంగళవారం పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

Telanagana-CM-KCR-as-a-member-of-the-Rajya-Sabha-Ktr-As-Cm

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తన కేబినెట్ లో ఓ కీలమ మంత్రిగానే కాకుండా పార్టీలో తన తర్వాతి స్థానంలో పార్టీ కార్యాధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును సీఎంగా చేసే కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈక్వేషన్ కుదరక కేసీఆరే వాయిదా వేస్తున్నారో లేదంటే... అసలు అలాంటి ఈక్వేషన్లే లేవో తెలియదు గానీ... ఎప్పటికప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ అలా వార్తలు రావడం కొన్నాళ్ల పాటు చక్కర్లు కొట్టడం మళ్లీ చప్పున చల్లారి పోవడం జరుగుతోంది. మొన్నటి మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ దక్కిన తర్వాత కేటీఆర్ పట్లాభిషేకం ఇక తథ్యమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ దఫా కూడా ఆ వార్తలన్నీ చప్పున చల్లారి పోయాయి. ఈ క్రమం లో ఇప్పుడు ఓ కొత్త ఈక్వేషన్ తెర మీదకు వచ్చింది. అదేమిటో చూద్దాం పదండి.

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

America-Decision-On-China-Corona-Virus

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

కరోనా వైరస్ ..ప్రస్తుతం చైనా తో సహా ..సుమారుగా 25 దేశాలని వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ భారిన పడితే కోలుకోవడం కష్టమే అని తెలుస్తుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ గురించి ఆందోళన మొదలైంది. ఈ వైరస్ ని తమ దేశంలోకి రానివ్వకుండా వివిధ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పుట్టిన చైనాలో ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ కరోనా భారిన పడి ఇప్పటికే సుమారుగా 400 మందికి పైగా మరణించారు. అలాగే వందల మంది ఈ వైరస్ భారిన పడినట్టు తెలుస్తుంది. దీనితో చాలా దేశాలు కూడా తమ దేశ పౌరులని వెంటనే చైనా నుండి వెనక్కి రావాలని పిలుపునిచ్చాయి.

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

జరిగి సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరించే అత్యంత పాశవికంగా కిరాతకంగా ఒక యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన.. వ్యక్తులకు తీవ్రమైన శిక్ష అయితే పడింది. ఇప్పుడు కాదు.. కొన్నేళ్ల కిందటే వాళ్లకు ఉరి శిక్ష ఖరారు అయ్యింది. అయితే ఇన్నాళూ ఆ శిక్ష అమలు గురించి అధికారులు ముందుకు వెళ్లలేదు. అయితే దిశపై అత్యాచారం నేపథ్యంలో.. నిర్భయ హంతకులు ఏమయ్యారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ శిక్ష అమలుకు ఫైళ్లు కదిలాయి. ఇక ఇదే సమయంలో.. నిర్భయ హంతకులు చట్టంతో ఆటలు మొదలుపెట్టారు.

These are the new districts of Andhra Pradesh! | ఆంధ్రాలో ఏర్పడే కొత్త జిల్లాలు ఇవే!

these-are-new-districts-of-andhra-pradesh

These are the new districts of Andhra Pradesh! | ఆంధ్రాలో ఏర్పడే కొత్త జిల్లాలు ఇవే!

ఏపీలో ఉన్నఫలంగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడు మెడికల్ కాలేజీలకు అనుగుణంగా కొత్త జిల్లాల  ఏర్పాటు జరగబోతూ ఉంది. ఇప్పటి వరకూ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి భారీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే అరకు కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...