అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?
కరోనా వైరస్ ..ప్రస్తుతం చైనా తో సహా ..సుమారుగా 25 దేశాలని వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ భారిన పడితే కోలుకోవడం కష్టమే అని తెలుస్తుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ గురించి ఆందోళన మొదలైంది. ఈ వైరస్ ని తమ దేశంలోకి రానివ్వకుండా వివిధ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పుట్టిన చైనాలో ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ కరోనా భారిన పడి ఇప్పటికే సుమారుగా 400 మందికి పైగా మరణించారు. అలాగే వందల మంది ఈ వైరస్ భారిన పడినట్టు తెలుస్తుంది. దీనితో చాలా దేశాలు కూడా తమ దేశ పౌరులని వెంటనే చైనా నుండి వెనక్కి రావాలని పిలుపునిచ్చాయి.ఇకపోతే ఈ సమయంలో అమెరికా చేసిన ఒక ప్రకటన పై చైనా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అమెరికా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పింది. ఇలా చైనాను సందర్శించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్తున్న అమెరికా చర్యలు భయాన్ని వ్యాప్తి చేయడానికే పనికొస్తాయన్నారు.
No comments:
Post a Comment