బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

indian-Central-government-New-educational-policy
కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య
దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దాదాపుగా అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు దేశంలో అమలు అవుతున్న విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తూ జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020) పేరిట రూపొందిన నివేదికకు మోదీ సర్కారు బుధవారం ఆమోద ముద్ర వేసింది. వెరసి మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా అమలు అవుతున్న విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్న కీలక విషయంతో పాటు ఆయా తరగతుల నుంచి పై తరగతులకు వెళ్లేందుకు నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని కూడా సమూలంగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా నిర్బంధ విద్యను కొనసాగించాలని కూడా మోదీ సర్కారు తీర్మానించింది. ఇప్పటిదాకా నిర్బంధ విద్య 14 ఏళ్ల వయసు వరకు మాత్రమే పరిమితం కాగా... దానిని 18 ఏళ్లకు పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే...

ISIS seeks to inflict corona on India .. | భారీ కుట్రకు తెర : భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్..

భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్.. 

ISIS seeks to inflict corona on India ..
భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్
దారుణమైన మైండ్ సెట్ తో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.

భారత్ ను దెబ్బ తీయటం కోసం ఐసిస్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.

Will India's population decline What is actually going on | భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

Will India's population decline What is actually going on
Will India's population decline What is actually going on
2100 సంవత్సరం నాటికి భారత జనాభా 100కోట్లకు పడిపోతుందని.. ఇప్పటితో పోలిస్తే 30-35 కోట్ల మంది వరకు జనాభా తగ్గిపోతుందని ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్ ఓ నివేదికలో పేర్కొంది.

అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుంది. మన తర్వాత నైజిరియా చైనా అమెరికా పాకిస్తాన్ లు నిలుస్తాయి. ప్రస్తుతం 780 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2100 నాటికి 880కోట్లకు పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

చైనాను భారత్ 2027 కల్లా జనాభాలో దాటేస్తోంది. 2047నాటికి 161 కోట్లకు చేరుతుంది. తగ్గుతున్న గర్భధారణ రేటు వృద్ధుల సంఖ్య పెరగడం.. వివాహాల వయసు పెరగడం.. కుటుంబ నియంత్రణ.. కాన్పుకు కాన్నుకు మధ్య దూరం వంటివి జనాభా తగ్గుదలకు కారణంగా నివేదిక పేర్కొంది.

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన
WHO-sensational-statement-on-the-virus
మహమ్మారి వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ వైరస్ కట్టడి.. నివారణ.. మందు కనిపెట్టుట.. వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఈ వైరస్ ఇప్పట్లో వైరస్ అంతం కాదని ఇంకా ప్రభంజనం కొనసాగుతుందని కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమవడానికి అనువైన వాతావరణం ఉందని.. ఇంకా ఉధృతి పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని.. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వైరస్ కట్టడి చర్యలు సమగ్రంగా అమలవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని దేశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

చైనాకు మరో షాక్: మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న భారత్

చైనాకు మరో షాక్: మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న భారత్

Another-shock-for-China--India-to-make-another-sensational-decision
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితికి కారణమైన చైనాపై సాధారణ ప్రజలతోపాటు భారత ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం ఉంది. డ్రాగన్ దేశానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆర్థిక వ్యవహారాలను దెబ్బ తీసేలా భారత్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనా వస్తువులు.. ఉత్పత్తులు.. సేవలు బహిష్కరించాలని ఉద్యమం వస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించి షాకిచ్చిన భారత్ ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కీలక దిగుమతులను అడ్డుకునే దిశగా భారత్ సమాలోచనలు చేస్తోంది. అదే జరిగితే మాత్రం చైనాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆ దేశ ఉత్పత్తి సంస్ధలు భారీగా నష్టపోనున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తోంది.

గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనాపై భారత వైఖరి పూర్తిగా మారిపోయింది. కీలకమైన చైనా ఉత్పత్తులను ఒక్కొక్కటిగా నిషేధిస్తూ రావాలని భావిస్తున్న కేంద్రం... తొలి విడతగా 59 పాపులర్ మొబైల్ యాప్ లను నిషేధించింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినా భారత్ వెనకడుగు వేయడం లేదు. తదుపరి చర్యపై కేంద్రం దృష్టి సారించింది.
Related Posts Plugin for WordPress, Blogger...