వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన
మహమ్మారి వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ వైరస్ కట్టడి.. నివారణ.. మందు కనిపెట్టుట.. వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఈ వైరస్ ఇప్పట్లో వైరస్ అంతం కాదని ఇంకా ప్రభంజనం కొనసాగుతుందని కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమవడానికి అనువైన వాతావరణం ఉందని.. ఇంకా ఉధృతి పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని.. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వైరస్ కట్టడి చర్యలు సమగ్రంగా అమలవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని దేశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
No comments:
Post a Comment