బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

BJP-Leader-GVL-Narasimha-Rao-On-About-Council-Abolishment

మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ శాసనమండలిపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లు కి అడ్డుపడుతుందన్న కోపంతో ఏకంగా సీఎం జగన్ మండలిని పీకేయడానికి నిర్ణయం తీసుకోని - అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ...ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు - అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకొచ్చారు.

ప్రపంచమంతా కరోనా కలకలం.. చైనా నుంచి ఇండియాకు వచ్చేస్తున్న విద్యార్థులు

Dangerous-virus-Corona-Students-from-China-to-India

ప్రపంచమంతా కరోనా కలకలం.. చైనా నుంచి ఇండియాకు వచ్చేస్తున్న విద్యార్థులు

చైనాలో పుట్టిన ‘కరోనా’ వైరస్ ఇప్పుడు వివిధ దేశాలకు విస్తరిస్తూ ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించడానికి రెడీ అయ్యిందన్న వార్తలు గుబులు రేపుతున్నాయి.

ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బ కు 100 మందికి పైగా చనిపోయారు. వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్థిక శాఖ 9 బిలియన్ డాలర్లు ప్రకటించి మహమ్మారిని తరిమివేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం చైనాలో 2744మందికి వ్యాధి సోకినట్టు గుర్తించారు. 461మంది చావుబతుకుల మధ్య ఉన్నారు.

సీఏఏ దేశానికి మంచిది కాదు.. అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయం : కేసీఆర్

Telangana-CM-KCR-Comments-on-Narendra-Modi-Blog-vedika

సీఏఏ దేశానికి మంచిది కాదు.. అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయం : కేసీఆర్

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌర సవరణ చట్టం (సీఏఏ) పై టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి భారీ స్ట్రోక్ ఇచ్చేసిన కేసీఆర్... సీఏఏ దేశానికి మంచిది కాదని అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే సీఏఏను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కేసీఆర్ తేల్చి పారేశారు. అంతటితో ఆగని కేసీఆర్... సీఏఏపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు. సీఏఏపై రాబోయే నెల రోజుల్లో  ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో హైదరాబాద్లో ఒక సమావేశం  నిర్వహిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?
ఒక మిత్రుడు పంపిన Facebook లింక్ ద్వారా ఈక్రింది పోస్టు వేశాను. అతని అభిప్రాయం ఎంతవరకూ వాస్తవమన్నది చూడటం కోసమే తప్ప ఇది నా స్వంత అభిప్రాయం మాత్రం కాదు. దేశానికి నిజంగా ఇంత గొప్ప ప్రయోజనాలు చేకూరాయా? లేక రాజకీయ అభిమాన డబ్బానా అనేది తెలియడం కోసమే!

మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీ ఈమధ్యన ఎందుకు చాలా మంది చేత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడని నేను చాలా ఆశ్చర్యపోయి ఆలోచించడం మొదలెట్టాను. చాలా వాస్తవాలను విశ్లేషించిన తరువాత ప్రతి అవినీతిపరులైన రాజకీయ నాయకులు, నల్లధనం బాధితులు, తీవ్రవాద గ్రూపులు, ఆటంకవాదులు, దేశద్రోహులు అందరి కడుపుమంటకి నిజమైన కారణం మన దేశభక్తుడైన ప్రధాని నరేంద్ర మోడిజీ యొక్క అవినీతి వ్యతిరేక విధానాల కారణంగానే అని అర్ధమైంది.
అది డి-మోనటైజేషన్ లేదా
బ్యాంక్ ఖాతాలతో ఆధార్ జత చేయడం, లేదా
టాక్సులు, సంపాదన, ఆదాయాలకు పాన్-కార్డుతో సహా ఆధార్ జత చేయడం
తద్వారా నల్లధనం నిర్మూలన, మాత్రమే వారి ద్వేషానికి కారణాలని కళ్ళకు కట్టినట్టు అర్ధమైంది....
వివరాలు:
* ఒక కొత్త బేస్ (ఆధార్ నం) ని లింకప్ చేయడం ద్వారా, ఒక మిలియన్ మంది కటిక పేదలు మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు *

* 30 మిలియన్ల (30,000,000) నకిలీ LPG కనెక్షన్ ఖాతాదారులు మాయమయ్యారు *

* మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న 1,95,000 నకిలీ బాల బాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైంది *

* 1.5 మిలియన్ల (1,500,000) నకిలీ రేషన్ కార్డుదారులు అదృశ్యమయ్యారు *

ఎందుకని ఈ తరహా నకిలీమనుషులు, అకౌంట్స్ ఖాతాదారులు మాయమవ్వడం ఎలా మొదలైంది ?
ఈ బ్లాక్ మార్కెట్ దొంగల మొత్తం చిట్టా బయట పడబోతోంది....... కాబట్టి ఈ దొంగలందరూ కలిసి గౌరవనీయమైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దావా ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్, పాన్ కార్డుల జతచేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాజ్యం వేశారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చిట్టాలో ఉండడం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హేయకరం *

మోడీ ఎం చేసాడు ?

* 1) 3 లక్షల పేపర్ నకిలీ కంపెనీలను మూసివేయబడ్డాయి. *

* 2) రేషన్ డీలర్లు దొంగ లిస్టులు కోల్పోవడంతో చాలా కోపంగా ఉన్నారు *

* 3) అక్రమ ఆస్తుల, బినామీ కింగ్ లు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు *

* 4) అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు Online సాధన వ్యవస్థతో తమ గుట్టులు రట్టవుతాయని బెంబేలుపడ్డారు. *

* 5) 40,000 నకిలీ NGO లను మూసివేశారు, కాబట్టి ఈ NGO ల యజమానులు శరాఘాత హతాశులయ్యారు *

* 6) బినామీ నంబర్ టూలనుండి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తులు హతాశులయ్యారు. *

* 7) ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా, చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడం మానివేశాయి. *

* 8) గ్యాస్ కంపెనీల ఆధారం చేయడం వాళ్ళ కొందరి ఆగ్రహం! *

* 9) ఇప్పటి వరకు, ఎప్పుడూ టాక్స్ అనేదే కట్టి ఎరుగని, కొత్తగా ఆదాయం పన్ను స్కాన్ కింద వచ్చి జేరిన 12 మిలియన్ల ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. *

* 10) GST వ్యవస్థ పరిచయంతో, వ్యాపార ప్రజలు ఏం చేయాలో పాలుపోక వ్యతిరేకత మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థకు వచ్చారు! *

* 11) నంబర్ టూ వ్యక్తుల ఆటలు సాగక, ఏం చేయాలో పాలుబోక అసహనులయ్యారు. *

* 13) దాచిన నల్లధనాన్ని తెల్లబరచడం కాస్త బాగానే పెళుసుగా మారి గట్టి దెబ్బ తీసింది. *

* 14) సోమరిపోతు ప్రభుత్వ అధికారులు సమయానికి రావడం, పోవడం నిష్ఠగా పనిచేయడం అన్నది ఎరుగక అతలాకుతలం అయ్యారు. *

* 15) సమయానికి పని చేయడమనే అలవాటు లేక, లంచాలను తీసుకోవడం మరిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జరుగుతోంది అర్ధం కాక నోరెళ్లబెట్టారు. *

* 16) నకిలీ కరెన్సీ డీలర్స్: - డిజిటల్ ఎకానమీ కారణంగా వారిపై ఒత్తిడి పెరిగి కకావికలమయ్యారు. *

* 17) తీవ్రవాద, ఉగ్రవాద, ముసుగు సంస్థలు: - వారి నిధుల సమీకరణ అనేది కరువై అత్యంత దయనీయంగా తయారైంది. *

* 18) రియల్ ఎస్టేట్ మాఫియా: - వారి చెల్లింపులల్లో, లావాదేవీల్లో చాలా పెద్ద భాగం నగదు రూపంలో ఉంటుందనీ, CASH FLOW కారణంగా అకౌంట్ జమ చేయలేని నగదు, నల్లధనం వివరాలు బయటకి కక్కలేక కకావికలం అయ్యారు. ఇప్పుడు అవి లెక్కించని నగదుకు, నల్లధనం ఎం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. *

* 19) రాజకీయ నాయకులు: - దాదాపుగా జీరో స్కాములు అని నిరూపించబడిన శ్రీ నరేంద్ర మోడిజీ కూడా తన పూర్వ ప్రధాన మంత్రుల వలె ఉండి, కళ్ళు, చెవులు మూసుకు పోవచ్చని, ఆశ పడ్డ రాజకీయ నాయకులు, బ్రోకరేజ్ వ్యక్తులు, సంస్థలు మోడీ గారి తీరుకి తీవ్ర అసంతృప్తికి మనస్తాపానికి గురయ్యారు.

ఇలా మోడీ వ్యతిరేకులు అందరూ కట్ట కట్టుకుని మోడీ వ్యతిరేకంగా కలిసిపోయి, ఒక కూటమిగా ఏర్పడి కూటు ఖిచిడి పార్టీని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. శ్రీ నరేంద్ర మోడిజీ రెండోసారి గద్దె ఎక్కకుండా ఉండాలని వెతకని దారి లేదు, లేపని రాయి లేదు.

అందువల్ల ఈ బాధ్యత ఇప్పుడు 1.25 బిలియన్ల మంది భారతీయులపై ఆధారపడి ఉంది.....
అవినీతిపరులైన ఖిచిడి పార్టీలకు మద్దతు ఇవ్వాలో...... లేదా
ఈ భరతమాత యొక్క నిజమైన కుమారుడు, ,భారతపుత్రుడు మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని నిర్ణయించడం అనేది మన చేతుల్లోనే ఉంది.
ఇప్పుడుబాల్ మీ కోర్టులో ఉంది. చేయాల్సింది మనమే. *

జైహింద్ ! జైభారత్ *

Source : https://www.facebook.com/permalink.php?story_fbid=242771036708095&id=100029256018791&__tn__=K-R

వాట్సాప్ గ్రూపులో జర జాగ్రత్త.. తేడా కొడితే నేరుగా జైలుపాలే!

Whatsapp -GROUP-CELL-BEWARE-If-the-difference-comes-from-Arreste-blog-vedika-news
ఇవాల్టి రోజున వాట్సాప్ వాడనోళ్లు లేరు. ఒకసారి వాట్సాప్ వాడటం మొదలెడితే.. ఏదో గ్రూపులో సభ్యుడిగా ఉండటం.. అలాంటి గ్రూపులు బోలెడన్ని ఒక్కొక్కరి అకౌంట్లో ఉండటం మామూలే.  ఈ గ్రూపుల్లో తమకు తెలిసిన సమాచారాన్ని.. ఫోటోల్ని.. వీడియోల్ని షేర్ చేసే ఔత్సాహికులు ఎందరో. అయితే.. ఇలా గ్రూపుల్లో పోస్టులు పెట్టే ఉత్సాహవంతులు కొన్నిసార్లు తెలీకుండానే తప్పులు చేస్తుంటారు.

మనసులో ఏమీ లేనోళ్లు కూడా అడ్డంగా బుక్ అవుతారు. వాట్సాప్ గ్రూపులో పెట్టే పోస్టులో ఏదైనా తేడా కొడితే నేరుగా జైలుపాలే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. హైదరాబాద్ లోని మౌలాలి షఫీనగర్ లో నివసించే మహమ్మద్ సాహెబాబ్ ఉల్ మునీర్ అలియాస్ 26 ఏళ్ల సిరాజ్ జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తుంటారు.

Related Posts Plugin for WordPress, Blogger...