మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ శాసనమండలిపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లు కి అడ్డుపడుతుందన్న కోపంతో ఏకంగా సీఎం జగన్ మండలిని పీకేయడానికి నిర్ణయం తీసుకోని - అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ...ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు - అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకొచ్చారు.