ఒక సంఘటన ఎంతటి మార్పును తీసుకొస్తుందన్న విషయం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకున్న విజయారెడ్డి సజీవదహనం చేసిన ఉదంతం స్పష్టం చేస్తోంది. మొన్నటి వరకూ తహసీల్దారు కార్యాలయానికి వచ్చి.. తహసీల్దారును కలవాలనుకుంటే సమయంతో పని లేకుండా వెళ్లి కలిసే వెసులుబాటు ఉండేది. ఇటీవల విజయారెడ్డిని ఆఫీసులోనే సజీవదహనం చేసిన ఉదంతం నేపథ్యంలో అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును వచ్చి కలిసే వీలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. విజిటింగ్ వేళల పేరుతో పరిమిత సమయంలో మాత్రమే కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసులో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడు వస్తున్నారన్న విషయాన్ని చూడనున్నారు.
ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును వచ్చి కలిసే వీలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. విజిటింగ్ వేళల పేరుతో పరిమిత సమయంలో మాత్రమే కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసులో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడు వస్తున్నారన్న విషయాన్ని చూడనున్నారు.