ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా
ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా |
ఎవరు అవునన్నా కాదన్నా భారత్ దూసుకుపోతోంది. కోటి పది కోట్ల జనాభాను కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాలో కరోనాతో విలవిలలాడుతుంటే... 130 కోట్ల జనాభాను ఒక్క తాటిపైకి తెచ్చిన కరోనా పై యుద్ధం ప్రకటించడం ద్వారా తొలి అతిపెద్ద విజయం సాధించారు మోదీ. అనంతరం మన దేశానికి సరిపడా మందులు తయారుచేసుకోవడమే కాకుండా కోవిడ్ 19 పై పోరుకు మన దేశాన్ని అభ్యర్థించేంత పెద్ద సంఖ్యలో మనం ఆ మందులు తయారుచేస్తున్నాం. అమెరికాతో పాటు ఇపుడు అనేక తోపు దేశాలకు ప్రాణభిక్ష పెడుతున్న మనదేశం ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ రకరకాలుగా బయటపడుతూనే ఉంది. తాజాగా చరిత్రలో మొదటి అమెరికా అధ్యక్ష భవనం అమెరికాకు చెందిన సంస్థలు వ్యక్తులు ప్రముఖులను కాకుండా మూడే మూడు ఇతర దేశాల ట్విట్టరు అక్కౌంట్లను ఫాలో అవుతోంది. ఆ మూడూ మనవే. ఒకటి ప్రధాని మోడీ వ్యక్తిగత అక్కౌంట్. రెండోదీ పీఎంవో అక్కౌంట్. మూడోది రాష్ట్రపతి అక్కౌంట్. ఇది తాజాగా జరిగిన మార్పు.
ఉత్తినే మనల్ని తీసిపడేసే స్థాయి నుంచి మన మీద ఇతర దేశాలు ఆధారపడే రోజులు వచ్చేశాయి. ప్రపంచం భ్రమలు మెల్లగా తొలగుతున్నాయి. ఇండియాను వేయాల్సింది అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో కాదు. సమర్థవంత దేశాల జాబితాలో వేయాలి. అదే దారిలో ఉంది ఇండియా. 50 వేల కంటే తక్కువ కేసులతో ఇండియా కరోనాపై విజయం సాధిస్తే ఇక ప్రపంచం పై మన ముద్ర వేసినట్టే అనుకోవాలి.
ఈ మాటలు మన సిక్కులరిస్ట్ మేధావులు,ఎర్రవారికి నచ్చటం లేదండి
ReplyDeletebaaga vrasaaru
ReplyDelete