బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏడాది పాలన పై ప్రజలకు మోదీ లేఖ ..!

PM-Narendra-Modi-letter-to-the-people-of-India
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయ్యింది. 2019 లో జరిగిన  ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ ఆర్టికల్ 370 రద్దు అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా .. దేశప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు.
 లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ సహృదయత చురుకైన సహకారం కొత్త శక్తిని స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా అంటూ మోదీ తెలిపారు.

2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే  ఓటు వేయలేదు. భారత్ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు సమీకృతమయ్యారు. జన శక్తి రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ  వెలిగించాయి. నా భారతీయ పౌరులరా గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి.

జల్ జీవన్ మిషన్ ..త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను రైతులను మహిళలను యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72000 కోట్ల రూపాయలు  9 కోట్ల  50 లక్షలమంది రైతుల ఖాతాల్లో  జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం.

బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం  కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం.

దేశప్రజల ఆశలు-ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో కరోనా మహమ్మారి భారత్ ను చుట్టు ముట్టింది. కరోనా దేశంలో వ్యాపించిన సమయంలో భారత్ మొత్తం ప్రపంచానికే ఒక సంక్షోభంలా మారుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈరోజు దేశ ప్రజలందరూ భారత్ను వారు చూసే ఆ దృక్పథాన్ని మార్చి చూపించారు. చప్పట్లు పళ్లాలు మోగిస్తూ దీపాలు వెలిగిస్తూ భారత సైన్యం ద్వారా కరోనా వారియర్స్ ను గౌరవించినా. జనతా కర్ఫ్యూ లేదా దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో నిబంధనలను నిష్ఠగా పాటించినా ప్రతి సందర్భంలోనూ భారతదేశం అత్యుత్తమ భారతదేశంగా మారగదలని మీరు హామీ ఇచ్చారు..

గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు మహిళలకు దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్ట మొదటి సారిగా గ్రామీణ భారతం లో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణ ప్రాంతం వారికంటే 10% ఎక్కువ గా నమోదైంది.

నా సహ భారతీయులారా మన దేశ ప్రజల ఆశలు ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన  కరోనావైరస్ మనదేశాన్నీ  చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా  మరోవైపు భారీ జనాభా పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో  ఉన్న మన దేశం  ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ సామర్థ్యానికీ శక్తిమంతమైన సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగ లేవని  మీరు నిరూపించారు.

కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా దీపాలు వెలిగించినా భారత సాయుధ దళాలను గౌరవించినా జనతా కర్ఫ్యూ అయినా దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా  ఎవరూ ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ బాధపడలేదనీ చెప్పటం లేదు. విశ్వ మహమ్మారి వల్ల ఇది మనకు సంక్షోభ సమయమే. కానీ దేశ ప్రజలందరికీ ఇది ఒక నిర్ణయాత్మక సమయం కూడా. ఏ విపత్తైనా ఎలాంటి సంక్షోభమైనా 130 కోట్ల మంది భారతీయుల వర్తమానాన్ని భవిష్యత్తును నిర్ణయించలేదనే విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా  ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం.

ప్రియ మిత్రులారా ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం.

ఇటీవల ఆత్మనిర్భర్ భారత్  అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు శ్రామికులు కావచ్చు  చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన కఠోరశ్రమ మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది.

ప్రియ మిత్రులారా గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మన దేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద మీ బలం మీద మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ.

మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా.  మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి సురక్షితంగా ఉండండి. అప్రమత్తం గా ఉండండి తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ అంటూ గత ఏడాది కాలంలో చేపట్టిన పలు సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...