బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగులకు విజిటర్ల సంఖ్య చాలా తగ్గిపోయింది.

కూడలి మూసివేత కారణమో లేక తెలుగు బ్లాగుల టపాలలో పస లేకో మొత్తానికి బ్లాగ్ విజిటర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు బ్లాగుల జోలికి పోవాలంటే ఏదోలా అనిపిస్తోంది. మాలిక,బ్లాగిల్లు అగ్రిగేటర్లు చూసినా పెద్దగా చదవదగ్గ మేటరేమీ కనిపించడం లేదు. అగ్రిగేటర్లలో గాంధిక బాషల బ్లాగులు ఎక్కువైపోయాయి. కథలు,సాహిత్యం,ఆధ్యాత్మికంతో కూడిన బ్లాగులు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇలా అయితే కొన్నాళ్ళకు తెలుగు బ్లాగుల ప్రపంచం కనుమరుగవడం ఖాయంగా తోస్తుంది.

కూడలి పని చేస్తుంది.

కూడలి మూతపడిన తరువాత ఒక్కసారిగా తెలుగు బ్లాగుల ప్రపంచం ఉలిక్కి పడిన విషయం మీకందరికీ విదితమే!. కాని కూడలి మీద అభిమానమున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా కూడలిని వీక్షించవచ్చు. కూడలిని మూసివేయక పొవుట చూస్తుంటే కూడలిని మళ్ళీ నడిపే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ఏది,ఏమైనా కూడలి వస్తే తెలుగు బ్లాగర్లకు ఆ ఆనందమే వేరు.
 కూడలి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

థార్మిక చర్చావేదిక

"సాక్ష్యం మేగజైన్" లో  "యేసు శిలువపై చనిపోలేదన్న" సంచలనాత్మకమైన అంశంపై ధార్మిక చర్చావేదిక కొనసాగుతుంది. దయచేసి మీరందరూ కూడా పాల్గొనవల్సినదిగా మనవి. వివరాలకు : Sakshyam Magazine చూడండి.

కామెంటర్లకు విజ్ఞప్తి!

గౌరవనీయులైన కామెంటర్లకందరికీ బ్లాగ్ వేదిక విన్నపం. దయచేసి టపాలకు సంబంధం లేని కామెంట్లు గాని లేక విమర్శనాత్మకమైన కామెంట్లు గాని పెట్టి బ్లాగర్లను విసిగించి వారిని బ్లాగు ప్రపంచం నుండి విరమించుకునేలా చేయవద్దు. మీకు నచ్చిన టపాలు చదివినప్పుడు అందులోని తప్పొప్పులను చూసించవచ్చు. దాని వలన ఏమిధమైన ఇబ్బంది ఉండదు. ప్రయోజనం కూడా ఉంటుంది. వ్యక్తిగత విమర్శల వలన ప్రయోజనమేముంది. బ్లాగు ప్రపంచంలో చులకన అవ్వడం తప్ప! దయచేసి కామెంటర్లు అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ... మీ చౌదరి.

బ్లాగ్ వేదికలో మీ బ్లాగులను నమోదు చేసుకోవచ్చు.

బ్లాగ్ వేదిక త్వరలో పెయిడ్ వెర్షన్ గా మారిపోతుంది. అప్పటివరకూ మీ బ్లాగులను నమోదు చేసుకోవచ్చు. మరొక విషయమేమిటంటే ఆల్రెడీ బ్లాగ్ వేదికలో ఉన్న బ్లాగులకు ప్రత్యేక రాయితీ కూడా ఉంటుంది. పెయిడ్ వెర్షన్ గా మారిన తరువాత నమోదు అయ్యే బ్లాగులకు మాత్రం రాయితీ వర్తించదు.
మీ బ్లాగుల నమోదు కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంత జరిగినా తమ పంధాను మార్చుకోని కామెంటర్లు.

సంకలిని,హారం,బ్లాగిల్లు.. ఇప్పుడు కూడలి ఇలా ఎన్నో టాప్ మోస్ట్ అగ్రిగేటర్లు కాలగర్భంలో కలిసిపోతున్నా కొంతమందికి ఏమాత్రం సానుభూతి కూడా లేదు. ఇంకా పైపెచ్చు తొక్కలో అగ్రిగేటర్లని అతి దారుణమైన విమర్శలు గుప్పించడాలు. ఇలా తగలబడితే ఇక తెలుగు బ్లాగర్లు నిలబడేదేక్కడ చెప్పండి? అగ్రిగేటర్ల వలన ప్రయోజనం పొందుతున్నవారు ఎవరూ ఇంటువంటి కామెంట్లను ఉపేక్షించరు. కొంతమంది అదేం పోయేకాలమో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.ఇదొక పైశాచిక ఆనందమేమో మరి.!

ఇక నుండీ "బ్లాగ్ వేదిక" రూల్స్ మార్పు!

ఇంతకు ముందు "బ్లాగ్ వేదిక" లో ఎన్నో ఫీచర్స్ నిర్వహించాలని అనుకునేవాడిని. బాగా డవలప్ చేయాలని అనుకునేవాడిని. కానీ ఒకరకంగా చెప్పాలంటే తెలుగుబ్లాగు ప్రపంచం ప్రోత్సాహం కరువయ్యి పూర్తిగా విరమించుకున్నాను. ఎలాగూ కూడలి,మాలిక,బ్లాగిల్లు ఉన్నవి కదా? వాటి ముందు నా బ్లాగ్ వేదిక ఎంత అనుకుని మిన్నకుండిపోయాను. ఎలాగూ అవి తమ సేవలను అందిస్తూనే ఉన్నాయి కదా! అనుకున్నాను. అయితే ఒక రోజు బ్లాగిల్లు మూతపడింది. (ప్రస్తుతం బ్లాగ్ స్పాట్ లో ఉంది.). ఇప్పుడు అగ్రిగేటర్ లలో నంబర్ వన్ అయిన కూడలి మూతపడిపోయింది. రేపో మాపో మాలిక కూడా మూతపడడం కాయం. ఇక తెలుగు బ్లాగులకు దిక్కేవరు?  అగ్రిగేటర్ లేకపోతే ఒక్క విజిటర్ కూడా బ్లాగుకు రాదు.అది ఎంత గొప్ప బ్లాగయినా? తప్పనిసరిగా అగ్రిగేటర్స్ కావాల్సిందే. ఎంత కాదన్నా మినిమం 10 అగ్రిగేటర్లయినా తెలుగు బ్లాగులకు ఉండాలి. దానిలో భాగంగా "బ్లాగ్ వేదిక"ను పూర్తిగా డవలప్ చేద్దామనుకుంటున్నాను. కఠినమైన నియమాలు తీసుకుందామనుకుంటున్నాను. 
"బ్లాగ్ వేదిక" లో అనుసంధానమైన ప్రతి బ్లాగరు సంవత్సరానికి 50రూపాయలు కట్టాలి.
 స్వంత రాతల బ్లాగులకు తప్ప కాపీ పేస్ట్ బ్లాగులకు అవకాశం లేదు.
బ్లాగ్ వీక్షకుల సూచన మేరకు ఎప్పుడూ TOP 10 బ్లాగులు డిస్ ప్లే అవుతూ ఉంటాయి.
ఇంకా...త్వరలో...
      ఇక పోతే 50 రూపాయలు కట్టి జాయిన్ అవ్వడం వలన ఉపయోగమేమిటి? అని ప్రశ్నిస్తే.. బయట స్క్రిప్ట్ కి 10,000 రూపాయలు పైగా అడుగుతున్నారు. దానితోపాటు డొమైన్ ఖర్చులు, హోస్టింగ్ ఖర్చులు ,మెయింటినెన్స్ ఖర్చులు ఇలా ఎన్నో అగ్రిగేటర్ భరించాల్సి వస్తుంది. ఇవ్వన్నీ ఒకసారితో సరిపోవు. ప్రతి సంవత్సరం అగ్రిగేటర్ భరించాల్సిందే! ఇది ఎంత తెలుగు బాష పట్ల, తెలుగు బ్లాగుల పట్ల గౌరవం ఉన్నా నిత్యం భరించాలంటే కుదురుతుందా చెప్పండి? ఎంత గొప్పవారైనా ఎవరు మోయగలరు? చెప్పండి.? ఈరోజు మూతబడిన అగ్రిగేటర్లన్నీ వాటి నుండి పైసా ఆదాయం లేక, ప్రతి సంవత్సరం ఖర్చులు మోయలేక అంతకంటే ముఖ్యం ఎంతో విలువైన సమయాన్ని (మెయింటైన్ కోసం) తీయలేకే మూతబడిపోయాలి. దానికి తోడు కొంతమంది బ్లాగర్ల దారుణమైన విమర్శలు. ఇవ్వన్నీ భరిస్తూ ఏ అగ్రిగేటర్ కి  మోయాల్సిన అవసరం ఉంది చెప్పండి.?
       నేను కూడా భరించలేను. అందుకనే  బ్లాగ్ వేదికకు చందా నిర్ణయించాను.
      మీరు నడుపుతున్నది బ్లాగ్ స్పాట్ లోనే కదా? దానికి 50రూ|| ఫీజ్ ఎందుకు? కనీసం డొమైన్ కూడా లేదు కదా?
      ఇది మీ ప్రశ్న అయితే ...త్వరలోనే దీనికి డొమైన్ కొంటాను. నేను అనుకున్న టార్గెట్ వరకూ బ్లాగర్ల నుండి ఫీజులు వస్తే స్క్రిఫ్ట్ ,హోస్టింగ్ కూడా తీసుకుంటాను. అప్పటి వరకూ బ్లాగ్ లోనే కొనసాగుతాను. డొమైన్ మాత్రం యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు హోస్టింగ్ కి మారినా URL మారకూడదు కాబట్టి. ఇప్పుడు బ్లాగ్ వేదిక లుక్ కూడా పూర్తిగా మారిపోయింది ఇంకా మారుతుంది. కుడి ప్రక్కా 100బ్లాగులు,ఎడం పక్కా 100బ్లాగులు రీసెంటివి ప్రదర్శించబడతాయి. ఒకసారి చూసి సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాను. ఇప్పుడు చెప్పండి నాప్రయత్నం బాగుందా? బ్లాగర్ల ప్రోత్సాహం లభిస్తుందా?
     
Related Posts Plugin for WordPress, Blogger...